భారతదేశపు అగ్రగామి వ్యవసాయ పరిష్కారాల సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (CIL), అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ అందజేసే ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు ‘స్వోర్డ్ ఆఫ్ హానర్ 2025’ను సంస్థకు చెందిన కాకినాడ ప్లాంట్ కైవసం చేసుకుంది. లండన్లోని చారిత్రాత్మక డ్రేపర్స్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. పారిశ్రామిక ఆరోగ్యం, భద్రత మరియు ఉద్యోగుల సంక్షేమం (EHS) వంటి విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన సంస్థలకు మాత్రమే దక్కే ఈ గుర్తింపు, కోరమాండల్ యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘనత సాధించే క్రమంలో కాకినాడ యూనిట్ బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నిర్వహించిన కఠినమైన ‘ఫైవ్-స్టార్ ఆడిట్’ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, వరుసగా మూడు సార్లు అత్యుత్తమ రేటింగ్ను సాధించడం విశేషం.
Read Also : Peddireddy Ramachandra Reddy: అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి
సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన రసాయన ప్రక్రియలను నిర్వహించే దేశంలోని అతిపెద్ద ఫాస్ఫాటిక్ ఎరువుల కేంద్రాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, కాకినాడ ప్లాంట్ పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేసింది. ప్లాంట్ ఆవరణలోనే వందకు పైగా వలస పక్షులకు ఆశ్రయం కల్పించే పక్షి అభయారణ్యాన్ని నిర్వహించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రకృతి సమతుల్యత రెండూ సాధ్యమేనని ఈ సంస్థ నిరూపించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, భద్రత అనేది తమ కార్యకలాపాల్లో ఒక భాగంగా కాకుండా, ఒక సంస్కృతిగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతికత, నిరంతర శిక్షణ మరియు ఉద్యోగుల భాగస్వామ్యంతో భవిష్యత్తులో మరింత సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైన తయారీ విధానాలను కొనసాగిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :