हिन्दी | Epaper

Sunitha Reddy: వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

Saritha
Sunitha Reddy: వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

Sunitha Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) లోతుగా విచారణ చేపట్టలేదని, కీలక ఆధారాలను కూడా పట్టించుకోలేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం వైఎస్ వివేకానంద రెడ్డి 7వ వర్ధంతి -సందర్భంగా పులివెందుల పట్టణంలోని వివేకా -సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు ఆర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో సునీతరెడ్డి తన తండ్రి హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు.

Read Also: Potti Sreeramulu Statue: అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!

Sunitha Reddy: వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి
Sunitha Reddy: Bharati must be questioned in the Viveka murder case.

సిబిఐ దర్యాప్తుపై సునీతారెడ్డి అసంతృప్తి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హత్య కేసులో కీలక నిందితులపై తాను కులుమార్లు వివరాలు చెప్పినా సిబిఐ వాటిని సీరియస్ గా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు ముందు, తరువాత నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, సందేశాలు చాలా కీలకమని, ముఖ్యంగా కిరణ్ యాదవ్ హత్యకు ముందు మరియు తర్వాత అనేక మందితో ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సాక్షి పత్రికలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని వార్త రావడానికి ఒక నిమిషం ముందు కిరణ్ యాదవ్కు అర్జున్ రెడ్డి మెసేజ్ పంపినట్లు తాను సిబిఐకి వివరాలు అందజేసినప్పటికీ వాటిపై సరైన విచారణ జరగలేదన్నారు. కిరణ్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ను రాసుకుని వచ్చారని మాత్రమే భావించి సిబిఐ విచారణ ముగించిందని, నిందితుల మధ్య హత్య అనంతరం జరిగిన ఫోన్ కాల్స్, మెసేజ్లను కూడా సమ గ్రంగా పరిశీలించలేదని ఆరోపించారు.

అందరూ మాకు అన్యాయం చేశారని ఆవేదన

ఈ కేసులో మరిన్ని ఆధారాలు సమర్పించాలని కోరి నప్పుడు తన వద్ద ఉన్న ఆదనపు ఆధారాలను కోర్టుకు, సిబిఐకి కూడా అందజేసినప్పటికీ వాటి పైనా విచారణ జరగలేదని సునీత పేర్కొన్నారు. కేసులో పూర్తి నిజాలు బయటపడాలంటే మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. తండ్రి హత్యకు న్యాయం కోసం తాను ఈ స్థాయిలో పోరాడుతున్నప్పటికీ ఇప్పటికీ న్యాయం జరగలేదని, అందరూ నాకు అన్యాయం చేశారని అయినప్పటికీ తన పోరాటం చివరి వరకు కొనసాగుతుందని సునీత రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మంలో సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

టెన్త్ విద్యార్థులకు నారా లోకేశ్ ఆల్ ది బెస్ట్

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

వాతావరణంలో అనూహ్య మార్పులు

వాతావరణంలో అనూహ్య మార్పులు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. ఎవరికి ఇల్లు వస్తుందంటే?

ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. ఎవరికి ఇల్లు వస్తుందంటే?

📢 For Advertisement Booking: 98481 12870