हिन्दी | Epaper

Nalgonda Road Accident: సాగర్ హైవేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Tejaswini Y
Nalgonda Road Accident: సాగర్ హైవేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Nalgonda Road Accident: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే పై దేవత్ పల్లి గేటు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రేఖ్య తాండ గ్రామ పంచాయతీలో లోని వస్త్రంతాండా పరిధిలో లోడుతో కొండమల్లేపల్లి నుండి ఏపీ ఇటుక 29యు 7795 నెంబర్ గల లారీ మల్లేపల్లి నుండి హైదరాబాదుకు వెళుతుండగా వస్త్రం తండా సమీపంలో 12 మంది ప్యాసింజర్ తో చింతపల్లికి వెళ్తున్న ఆటో నంబర్ ఏపీ 24టిసి 5299 ను వెనక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టింది.

Read Also: NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

Nalgonda Road Accident: Fatal accident on Sagar Highway.. Three dead
Nalgonda Road Accident: Fatal accident on Sagar Highway.. Three dead

మృతుల వివరాలు

చింతపల్లి మండలం కోర్ర మాన్ సింగ్ తండాకు కు చెందిన ఆటో డ్రైవర్ కోర్ర భద్ర(57), బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ ఖలీఫా(40) ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాకు చెందిన బండారు స్పాట్లోనే మృతిచెందారు. ఇషాక్ (55) లు ఆటోలో ప్రయాణిస్తు తీవ్ర గాయాలైన 8 మందిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంతోష్ ఖలీఫా ఇటుక బట్టీలు కార్మికుడిగా పనిచేస్తుండగా బండారు ఇసాక్ తోటలు కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. మృతి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది పర్యవేక్షణలో ఎస్సై లింగారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870