हिन्दी | Epaper

NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

Anusha
NMC: స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

NMC: ఎంబీబీఎస్ ఇంటర్న్‌లు, పీజీ మెడికల్ విద్యార్థులకు సకాలంలో స్టైఫండ్ చెల్లించని 7 మెడికల్ కాలేజీలపై నేషనల్ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 1 కోటి చొప్పున భారీ జరిమానా విధించింది. విద్యార్థుల కష్టార్జితాన్ని చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన యాజమాన్యాలకు ఇది గట్టి హెచ్చరికగా మారింది.

Read Also: CM Stalin Decision: వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు

NMC imposes fine on colleges for evading stipend
NMC imposes fine on colleges for evading stipend

సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన

గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ప్రతి మెడికల్ కాలేజీ తమ విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైఫండ్ వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో పారదర్శకంగా పొందుపరచాలి. అయితే, ఈ 7 కాలేజీలు ఆ వివరాలను వెల్లడించకపోవడమే కాకుండా, విద్యార్థులకు అందాల్సిన భత్యాన్ని ఆపేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఎంసీ ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.భవిష్యత్తులోనూ స్టైఫండ్ చెల్లించకపోయినా, వివరాలు వెల్లడించకపోయినా కొత్త అడ్మిషన్లు నిలిపివేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తామని ఎన్ఎంసీ హెచ్చరించింది. జరిమానా పడిన కాలేజీలలో ఏపీలోని ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870