हिन्दी | Epaper

Nizamabad: ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

Saritha
Nizamabad: ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

ఇందల్వాయిలో బోల్తాపడిన బస్సు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు వెళుతున్న ప్రైవే టు బస్సు ఒక మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులు దుర్మణం చెందారు. నిజామాబాద్ లోని ఇందల్వా యి మండలం గన్నారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణీకులు వున్నారు. వీరంతా హైదరాబాద్ నుం చి వివాహం కోసం అకోలాకు వెళుతున్నారు. మరణించిన వారిలో మంజూషా (29) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు రిషి (7), అబ్బాస్ (22 ), ఇంకో వ్యక్తి వున్నాడు. ఇదే ఘటనలో మరో 15 మంది గాయపడగా వీరిలో పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంటనే జిల్లా ఆ సుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Mera Ration Feature: రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

Nizamabad: ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం
Nizamabad: Private Bus Overturns in Indalwai Four Dead

బస్సు ప్రమాదంలో ఎనిమిది రామచిలుకల మృతి

ఇదే ఘటనలో ప్రయాణీకులతో పాటు ఒక బుట్టలో కుక్కినట్లు వున్న 60 రామ చిలుకలు వుండగా ప్రమాద తరువాత ఈ బుట్ట దూరంగా ఎగిరిపడింది. ఈ ఘటనలో ఎనిమిది రామ చిలుకలు ఊపిరి ఆడక మరణించాయి. ఈ ఘటన తరువాత పోలీసులు, రవాణా శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రామ చిలుకల బుట్టను వేరుచేసి సజీవంగా వున్న వాటికి మంచీనీరు తాగించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. గాయపడి ఎగురలేని రామ చిలుకలను స్థానిక పశువైద్య శాలకు తరలించి చికిత్స అందించారు. ఇవి కోలుకున్న తరువాత స్వేచ్చగా వదిలిపెడతామని అధికారులు తెలిపారు. రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు వేరుగా విచారణ చేబట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

📢 For Advertisement Booking: 98481 12870