Telangana: మధ్య ఆసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా దేశంలో 3 నెలకొన్న గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కంపెనీలతోపాటు గ్యాస్ సిలిండర్లు తర లించే వాహనాలకు పరిస్థితులను బట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. గ్యాస్ సంక్షోభం వల్ల దేశ వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లకు భారీగా కొరత ఏర్పడడం తెలిసిందే. దీనివల్ల అనేక రాష్ట్రాలలో హోటళ్లు మూతపడగా చాలాచోట్ల కట్టెల పొయ్యిలపై వంటలు సాగుతుండడం విదితమే. మరికొన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ల చోరీలు జరగడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల తరలింపులో ఎక్కడా ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా వుండేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
Read Also: Telangana Rice Production: వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్

జిల్లాల పోలీసులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు గృహావసరాలకు గ్యాస్ సరఫరాలో కొంతమేర ఇబ్బందులువున్నా తీవ్రమైన సంక్షోభం మాత్రం ఎదురవ్వలేదు. అయితే గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి మాత్రం ఎక్కువయ్యింది. చాలాచోట్ల వినియోగదారులు ముందుజాగ్రత్త చర్యగా అదనపు సిలిండర్లను కొనుగోలు చేయడం వల్ల గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. ఇది మరింత పెరగకుండా వుండేందుకు గ్యాస్ కంపెనీల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు గ్యాస్ కంపెనీలకు చమురు కంపెనీల నుంచి వచ్చే సిలిండర్ల లారీల వెంట బందోబస్తు కొనసాగించాల ని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. చమురు సంక్షోభం కొలిక్కి వచ్చేవరకు ఈ బందోబస్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: