BC Protection Act : వెనుకబడిన తరగతులు గౌరవ ప్రదమైన జీవ నం సాగించడంలో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై నేడు (శనివారం) జరగనున్న కీలక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులతో పాటు రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, హోం మంత్రి అనిత పాల్గొనబోతున్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో హామీలో భాగంగా వెనుకబడిన తరగతులకు గౌరవ ప్రదమైన జీవ నం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Read Also : BITS Pilani Amaravati: దేశంలోనే తొలి ఏఐ క్యాంపస్: బిట్స్ పిలానీ భారీ ప్రణాళిక!

దీనిలో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఇప్పటికే బీసీ మంత్రులు రెండు పర్యాయాలు భేటీ అయ్యామన్నారు. మూడో సారి విజయవాడ తాడిగడపలోని బీసీ వెల్ఫేర్ డైరెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించను న్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తనతో పా టు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాశ్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ పాల్గొంటున్నారన్నారు. బీసీ మంత్రులతో పాటు రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, హోం మంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్తో పాటు న్యాయ శాఖ కార్యదర్శి, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని మంత్రి సవిత స్పష్టంచేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :