हिन्दी | Epaper

Nara lokesh news : లోకేశ్ చొరవతో ఏపీఎస్పీకి శుభవార్త, 300 మందికి ప్రమోషన్

Sai Kiran
Nara lokesh news : లోకేశ్ చొరవతో ఏపీఎస్పీకి శుభవార్త, 300 మందికి ప్రమోషన్

Nara lokesh news : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పదోన్నతుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు చివరకు శుభవార్త లభించింది. ప్రభుత్వం ఏకకాలంలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఏఆర్ఎస్ఐ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రక్రియ వేగంగా పూర్తయ్యింది. చాలా కాలంగా పదోన్నతులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు ఇటీవల ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.

సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కారం చూపుతానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమోషన్ల ఫైల్‌ను ముందుకు తీసుకెళ్లారు.

Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

Nara lokesh news
Nara lokesh news

వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే సివిల్, ఏఆర్ విభాగాలతో పాటు ఏపీఎస్పీ సిబ్బందికి కూడా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, తర్వాత ఎన్నికల నియమావళి అమలులోకి రావడం వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

గత ఐదేళ్లలో పలుమార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి లోకేశ్ జోక్యంతో ఈ ప్రక్రియ పూర్తి అయింది.

దీంతో సుమారు 300 కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ సమస్యను త్వరగా పరిష్కరించిన మంత్రి లోకేశ్‌కు ఏపీఎస్పీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870