
Araku Kouni: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన సంస్కృతికి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి గుర్తింపుగా ‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా పండించే చిరుధాన్యాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.
Read Also: fresh water :స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?
సహజ సిద్ధమైన ఉత్పత్తుల ప్రదర్శన
ఈ మెనూలో గిరిజన రైతులు పండించిన వివిధ రకాల చిరుధాన్యాలతో చేసిన ఆహార ఉత్పత్తులు కొలువుదీరాయి. ముఖ్యంగా:
ప్రదర్శించిన వంటకాలు: రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, కాంట్ల అంబలి, కార్న్ వడ,తూర్ దాల్ కర్రీ (కొండ కందుల పప్పు).
ధాన్యాలు: కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: