Priyanka Arul Mohan: తన యాక్టింగ్ మరియు బ్యూటీతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సినీ పరిశ్రమలో ఎదుగుతున్నప్పుడు క్రిందకు లాగడానికి, సోషల్ మీడియాలో ట్రోల్స్ (Trolls) చేయడానికి కొందరు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Read Also: The Bluff: ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

క్రిందికి లాగే వాళ్లు ఉంటారు..
ప్రియాంక మాట్లాడుతూ.. “నేను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఇవన్నీ చూశాను. మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని క్రిందకు లాగే వాళ్లు, మనపై చెడు ప్రచారం చేసే వాళ్లు ఉంటారు. ఇలాంటి పరిస్థితులే మనల్ని దృఢంగా మారుస్తాయని నేను నమ్ముతాను. నా జీవితంలో ఎన్నో చూశాను. ఈ ట్రోలింగ్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపవు” అని అన్నారు.
ట్రోలింగ్స్ నాకు కొత్త విషయాలు నేర్పుతాయి..
ట్రోలింగ్స్పై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. “నేను ఇలాంటి ట్రోలింగ్స్ను పట్టించుకోను. కానీ, వాటి నుండి కొత్త విషయాలు నేర్చుకుంటాను. నా పనిపై దృష్టి పెడతాను. ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అది చాలు” అని అన్నారు. ప్రియాంక అరుల్ మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :