Bhadreshkumar Patel: అమెరికాలో తన భార్యను అతి దారుణంగా హత్య చేసి పదేళ్లకు పైగా తప్పించుకు తిరుగుతున్న భారతీయ సంతతి వ్యక్తి భద్రేశ్కుమార్ చేతన్భాయ్ పటేల్పై అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్బీఐ భారీ రివార్డును ప్రకటించింది. అతని ఆచూకీ చెప్పిన వారికి గతంలో ఇస్తామన్న 2,50,000 డాలర్ల రివార్డును ఏకంగా 1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 9.18 కోట్లు) పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్బీఐ ప్రకటించిన ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’ నేరస్తుల జాబితాలో భద్రేశ్కుమార్ ఒకరిగా ఉన్నాడు.
Read Also:Mahabubabad crime: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

అసలేం జరిగింది?
2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్లోని ఒక ‘డంకిన్ డోనట్’ షాపులో నైట్ షిఫ్ట్ చేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. భద్రేశ్కుమార్ తన భార్య పాలక్ పటేల్ (21)తో గొడవపడి, ఆమెను కిచెన్ వెనుక భాగంలో దారుణంగా హత్య చేశాడు. విచారణలో తేలింది ఏంటంటే.. పాలక్ తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలని కోరుకోగా, భద్రేశ్కుమార్ అందుకు అంగీకరించకపోవడమే ఈ హత్యకు దారితీసింది.
హత్య తర్వాత చాకచక్యంగా తప్పించుకున్న నిందితుడు.. న్యూజెర్సీలోని విమానాశ్రయం సమీపంలో చివరిసారిగా కనిపించి, ఆపై అదృశ్యమయ్యాడు. గత 11 ఏళ్లలో అనేక ఆధారాలు లభించినప్పటికీ, అతడు ఎక్కడ ఉన్నాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ భారీ రివార్డుతోనైనా ప్రజల నుంచి సమాచారం వస్తుందని, పాలక్ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఎఫ్బీఐ బాల్టిమోర్ అధికారులు ఆశిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: