Sampath Kumar: రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదు ప్రధానికి మనుమడు, ఇంకో ప్రధానికి కొడుకు అయిన రాహుల్ కి సొంత ఇల్లు లేదని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. గాంధీభవన్లో విలేఖరులతో మాట్లాడుతూ కెటిఆర్ (KTR) సిఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాహుల్ కి ఆస్తులు కావాలంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకుంటే 1000 కోట్లు అవుతాయని రేవంత్ అంటే దానిని ఇంకో రకంగా మార్చి ప్రజలకు చెప్పి వారి మనస్సులను కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Read Also: Telangana Oil Fed: ఆయిల్ పామ్ సాగులో మరింత అభివృద్ధి

కెటిఆర్ వైఖరిపై ఆగ్రహం
కెటిఆర్ మారకపోతే ఇంకో రకంగా స్పందించాల్సి వస్తుందని అగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్ మారకపోతే ప్రజలు ఇంకా ఛీ కొడతారనీ హితువ చెప్పారు. బిఆర్ఎస్ ఇంత చిల్లరగా ఉన్నా సిఎం ఓపికగా ఉంటున్నారుఇంత ఓపికగా ఉంటున్న సిఎంకి దండం పెట్టాలనీ ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును కెసిఆర్ కల్వకుంట్ల కుటుంబానికి దోచి పెట్టారనీ విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ బందు, కెటిఆర్ బందు, హరీష్ బందు, సంతోష్ బందు, కవిత బందు ఉండేదనీ ఇప్పుడు ఏ బందులేదనిచిల్లర రాజకీయాలు చేయడం కెటిఆర్ మానుకోవాలనీ కోరారు.
ప్రభుత్వ సొమ్ము దుబారాపై విమర్శలు
తప్పుడు ప్రచారాలు చేయడంలో కెటిఆర్ దిట్ట నిజాలను అబద్ధాలుగా మార్చడం కెటిఆర్ కి వెన్నతో పెట్టిన విద్యలాంటి అలవాటు అని అన్నారు. కెటీఆర్ అబద్ధాలను నిజాలుగా వక్రీకరిస్తున్నారనీ ఆయన నీచ రాజకీయాలకు పాల్ప డుతూ హెడ్ లైన్స్ కోసమే తాపత్రయం అని భాష్యం చెప్పారు. విమర్శలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి, వచ్చి అబద్ధాలను కెటిఆర్ ప్రజలపై రుద్దతున్నారని ఆయన అవేదనచెందారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కెటిఆర్ ప్రభుత్వ పైసలను దుబారా చేసారనీ గవర్నమెంట్ సొమ్ముతో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా చేసేందుకు వేరే రాష్ట్రాల వారిని ఫైట్స్ లో రప్పించారనీ ఆయన గుర్తుచేశారు. కెసిఆర్ ఫోజులు కొట్టేందుకు తెలంగాణ పైసలను పంజాబ్ లో పంచారనీ, కెసిఆర్ ఆర్ధిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: