हिन्दी | Epaper

Bahrain Telugu pilgrims: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

Saritha
Bahrain Telugu pilgrims: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

Bahrain Telugu pilgrims: యుద్ధ వాతావరణం కారణంగా బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన 65 మంది తెలుగు యాత్రికులు ఎట్టకేలకు క్షేమంగా మంగళవారం హైదరాబాద్ రావడానికి మార్గం సుగమం అయింది. కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు తమను ఆదుకున్న ప్రభుత్వ యంత్రాంగానికి, తెలుగు సంఘాలకు తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొనె సల్మాన్ రాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: PM Kisan : ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

Bahrain Telugu pilgrims: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి
Bahrain Telugu pilgrims: Telugu pilgrims stranded in Bahrain return home

నిలిచిపోయిన విమాన సర్వీసులు

మంగళవారం బహ్రెయిన్ నుండి ప్రభాతవార్తతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గత నెల ఫిబ్రవరి 24న టూరిస్ట్ వీసాపై బహ్రెయిన్ వెళ్లిన తాము 28న తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే అనూహ్యం గా యుద్ధం ప్రారంభం కావడంతో విమాన సర్వీసులు నిలిచిపోయి అక్కడే చిక్కుకు పోయామని అన్నారు. భయానక పరిస్థితుల మధ్య 10 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపామని అన్నారు. తాము స్వదేశానికి రావడానికి కృషి చేసిన సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ మంత్రి బహ్రెయిన్ నుండి హైదరాబాద్ కు పయనమైన తెలుగు ప్రజలు రాజ్ నాథ్ సింగ్ తక్షణమే స్పందించి విమానయాన శాఖతో సమన్వయం చేయడం వల్లనే మంగళవారం గల్ఫ్ ఎయిర్ ద్వారా బాధితులు క్షేమంగా హైదరాబాద్ పయనం అవడానికి మార్గం సుగమం అయిందన్నారు. తెలుగు అసోసియేషన్ బహ్రెయిన్ ప్రతినిధులు ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేస్తూ ప్రయాణ ఏర్పాట్లు పర్యవేక్షించారన్నారు.

ప్రభుత్వాల సత్వర స్పందన

తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఎ, ఎపిఎన్ఆర్, తెలుగు కళా సమితి ఫిబ్రవరి 28 నుండి అండగా నిలిచిన సభ్యులు రఘునాథ్ బాబు, శివకుమార్, సతీష్ శెట్టి, కె. మోహన్, జగదీష్, ప్రసాద్, కె. సంతోష్, జోయల్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమకు బహ్రెయిన్లో తెలుగు ప్రజలు 65 మందికి 10 రోజుల పాటు ఉదయం అల్పాహారం, భోజనం, తాగునీరు అందించిన దాతృత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ సమస్యను నిరంతరం ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తెలుగు జాతీయ దినపత్రిక వార్తకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాలు, ప్రవాస తెలుగు సంఘాలు చూపిన చొరవ వల్లే ఈరోజు తాము సురక్షితంగా ఇళ్లకు చేరుకోగలిగామని బాధితులు భావోద్వేగంతో వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870