Mahabubabad: సాధారణంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు బంధుమిత్రులను సాదరంగా ఆహ్వానిస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఎలాంటి పిలుపు లేకుండానే వేడుకలకు హాజరై భోజనాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి “బిన్బులాయే మెహమాన్” (పిలవని అతిథుల) సమస్యకు చెక్ పెట్టేందుకు మహబూబాబాద్కు చెందిన ఒక ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన హాల్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Read Also :Urea Stock: ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువుల నిల్వలు

సెక్షన్ 441 కింద కఠిన చర్యలు.. రూ. 5000 జరిమానా
అనధికారికంగా వేడుకలకు హాజరయ్యే వారిని నిలువరించేందుకు సదరు యజమాని చట్టపరమైన హెచ్చరికలను జారీ చేశారు. ఆ బోర్డుపై ఉన్న వివరాల ప్రకారం, ఎవరైనా ఆహ్వానం లేకుండా ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించి దొరికిపోతే, వారికి సెక్షన్ 441 (Criminal Trespass) కింద మూడు నెలల జైలు శిక్ష మరియు రూ. 5,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. శుభకార్యాలు చేసుకునే వారు పరిమిత సంఖ్యలో అతిథులను పిలుచుకుంటారని, పిలవని వారు రావడం వల్ల అసలైన అతిథులకు ఇబ్బందులు కలగడమే కాకుండా నిర్వాహకులకు ఆర్థిక భారం పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ బోర్డు ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది యజమాని నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు ఇలాంటి నిబంధన మరీ కఠినంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ఫంక్షన్ హాల్ యజమాని తీసుకున్న ఈ చట్టపరమైన అడుగు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :