Surat Suicide: గుజరాత్లోని సూరత్ నగరంలో ఇద్దరు యువతులు (18, 20 ఏళ్లు) ప్రాణాలు తీసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్య కేసులో విస్తుపోయే విషయాలను పోలీసులు వెల్లడించారు. తాము తనువు చాలించడానికి ముందే ఆ ఇద్దరు యువతులు చాట్జీపీటీ (ChatGPT) సహాయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. “ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడితే ప్రాణాలు పోతాయి?” వంటి ప్రశ్నలను ఏఐ (AI) బాట్ను అడిగి, అందులోని సమాచారం ఆధారంగానే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
Read Also:Maharashtra: బోర్డు పరీక్షల్లో ‘చాట్జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

సాంకేతికతను ఇటువంటి దారుణమైన పనులకు వినియోగించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒక నెటిజన్ ఈ వార్తను ఎక్స్ (X) వేదికగా పంచుకోగా, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దీనిపై స్పందించారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ ఆయన “Yikes” (ప్రమాదకరం లేదా షాకింగ్) అని రిప్లై ఇచ్చారు. మానవ ప్రాణాలను కాపాడాల్సిన సాంకేతికత, ఇలా ప్రాణాలు తీయడానికి మార్గదర్శిగా మారడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఈ వ్యవహారంపై టెక్ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ChatGPT లేదా Google Gemini వంటి కృత్రిమ మేధస్సు సాధనాలు ఆత్మహత్యలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవు. ఎవరైనా ఇటువంటి ప్రశ్నలు అడిగితే, వెంటనే సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్లను సూచిస్తాయి. మరి ఈ కేసులో ఆ యువతులు ఏఐ నుండి సమాచారాన్ని ఎలా పొందారు? ఫిల్టర్లను దాటి సమాధానాలు రాబట్టారా? అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: