అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పవర్ప్లేలోనే కీలక వికెట్లు పడగొట్టి కివీస్ను కోలుకోలేని దెబ్బ తీశారు. జస్ప్రీత్ బూమ్రా తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగా, మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంతో పరుగుల వేగాన్ని కట్టడి చేశారు. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, హార్డిక్ పాండ్యా కీలక సమయంలో వికెట్లు తీసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ మరియు అద్భుతమైన ఫీల్డింగ్తో టీమ్ ఇండియా న్యూజిలాండ్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఘనవిజయం సాధించింది.
YS Sharmila statement : నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్
మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా భారత్
ఈ విజయంతో భారత్ తన మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతకుముందు బ్యాటింగ్లో సంజూ శామ్సన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది. ముఖ్యంగా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు మరియు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ శామ్సన్ రికార్డు సృష్టించడం విశేషం. సమిష్టి కృషితో సాధించిన ఈ విజయం భారత క్రికెట్ అభిమానులకు తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్టేడియం మొత్తం మువ్వన్నెల జెండాలతో, బాణాసంచా వేడుకలతో పండుగ వాతావరణం సంతరించుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :