మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల కేవలం ఒక స్టార్ హీరో భార్యగానే కాకుండా, తన వినయం, సంస్కారం మరియు కుటుంబ విలువల ద్వారా ఆదర్శవంతమైన మహిళామణిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అందరూ తనను గొప్ప మేనేజర్ అని అంటుంటారని, కానీ తాను చేసే పనిని నిజాయితీగా, నిస్వార్థంగా నిర్వహించడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. భార్యగా, అమ్మగా, అత్తగా, మరియు అమ్మమ్మగా తన పాత్రలను ఆత్మగౌరవం దెబ్బతినకుండా పోషిస్తున్నానని ఆమె చెప్పిన మాటలు ఆమెలోని వినయాన్ని చాటిచెబుతున్నాయి. ముఖ్యంగా తన కోడళ్లను కూతుళ్లలా భావిస్తూ, మెగా కుటుంబంలోని ఐక్యతకు ఆమె ఒక బలమైన పునాదిలా నిలుస్తున్నారు.
Read Also : Mamata Banerjee news : బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ లోపం? ముర్ము అసహనం
నేటి సమాజంలో ఆస్తుల కోసం సొంత మనుషులే గొడవలు పడుతున్న తరుణంలో, సురేఖ గారు తన ఆడపడుచులకు (చిరంజీవి సోదరీమణులు) ఆస్తులను రాసి ఇచ్చి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి గారే ఒక సందర్భంలో వెల్లడిస్తూ ఆమె ‘బ్రాడ్ మైండ్’ను కొనియాడారు. కేవలం రక్త సంబంధీకులనే కాకుండా, అందరినీ కలుపుకుని పోవడమే కుటుంబం అని నమ్మే ఆమె సంస్కారం అభినందనీయం. అల్లు శిరీష్ పెళ్లి వంటి వేడుకల్లో ఆమె చూపిన చొరవ మరియు నిస్వార్థమైన ప్రేమ మెగా-అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచాయి. ఇంతటి ఘనమైన నేపథ్యం ఉన్నప్పటికీ, ఎంతో సాధారణంగా ఉంటూ బాధ్యతలను నెరవేరుస్తున్న సురేఖ కొణిదెల నిజంగానే నేటి తరం మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తిప్రదాత.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :