Hyderabad: హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) అధికారులు.. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి కీలక విషయం వెల్లడించారు. పంప్ హౌజ్లో పాత ఎలక్ట్రిక్ ప్యానెల్స్ స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. పనులు పూర్తి అయిన తర్వాత తిరిగి యధావిధిగా మంచి నీటి సరఫరా కొనసాగించనున్నట్లు తెలిపారు.
Read Also: Amberpet Flyover: పూర్తికాని పనుల పై రేవంత్రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

శని, ఆదివారాల్లో అంతరాయం
హైదరాబాద్ నగర వాసులకు నిత్యం తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్లోని పంప్ హౌజ్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు హైదరాబాద్ జలమండలి అధికారులు వెల్లడించారు. 35 ఏళ్లకు పైగా పాతబడిన హెచ్టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్ను తొలగించి వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈనెల 7, 8వ తేదీల్లో (శనివారం, ఆదివారం) సుమారు 36 గంటల పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: