TIDCO Houses: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను ఉగాది నాటికి లక్ష మంది లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. జూన్ నెల నాటికి అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు.
Read Also: Accidents : రోడ్డు ప్రమాదాల నివారణకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
2028 నాటికి ఇంటింటికీ తాగునీరు
కేవలం గృహనిర్మాణమే కాకుండా, ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీటిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. 2028 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

పరిశుభ్రమైన వాతావరణంలో 205 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 3.07 కోట్ల మంది అల్పాహారం, 3.64 కోట్ల మంది భోజనం, 1.59 కోట్ల మంది రాత్రి భోజనం తీసుకున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మరో 75 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేశామన్నారు. వివిధ శాఖల ఎన్ఓసీలను సింగిల్ విండో విధానంలో మంజూరు చేస్తున్నామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: