हिन्दी | Epaper

Telangana: ఐపీఎస్ లను పెంచండి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

Anusha
Telangana: ఐపీఎస్ లను పెంచండి.. అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు ప్రధానంగా ఐపీఎస్ అధికారుల కొరతపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాలని, అదనపు క్యాడర్‌ను కేటాయించాలని సీఎం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Read Also: Telangana Rains: ఈ నెల 18,19 తర్వాత భారీ వర్ష సూచన

క్యాడర్ రివ్యూలో జాప్యం.. కేటాయింపులపై అసంతృప్తి!

రాష్ట్ర విభజన తర్వాత 2016లో మొదటిసారి ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగిందని, ఆ తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ అత్యంత ఆలస్యంగా 2025లో జరిగిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఇంత కాలం నిరీక్షించినా, కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభా, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదని అమిత్ షాకు వివరించారు.

Telangana: Increase the number of IPS officers.. CM Revanth's request to Amit Shah
Telangana: Increase the number of IPS officers.. CM Revanth’s request to Amit Shah

దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోంద‌ని చెప్పారు.హైదరాబాద్, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవ‌స‌రం ఉంద‌ని వివరించారు. మూడో క్యాడ‌ర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేప‌ట్టాల‌ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 మంది ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నార‌ని.. ఆ సంఖ్యను 103కు పెంచి కేటాయించాల‌ని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

📢 For Advertisement Booking: 98481 12870