Hyderabad Drugs: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (TGNAB) మరియు రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. చదువుకోవడానికి విద్యార్థి వీసాపై భారత్కు వచ్చి, అక్రమ మార్గంలో మాదకద్రవ్యాల సరఫరాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్

రూ. 20 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం
నిందితుల నుంచి సుమారు రూ. 20 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు మరియు ఒక కత్తిని కూడా సీజ్ చేశారు. పట్టుబడిన వారిని యెమెన్కు చెందిన అబ్దురబు మరియు పాలస్తీనాకు చెందిన హసన్ డబ్ల్యూ.ఎ.హషేంగా గుర్తించారు.
ఆరుసార్లు అరెస్టయిన పాత నేరస్థుడు
నిందితుల్లో ఒకరైన అబ్దురబు గతంలో కూడా డ్రగ్స్ సరఫరా కేసుల్లో ఆరుసార్లు అరెస్టయినట్లు విచారణలో తేలింది. జైలుకు వెళ్లి వచ్చినా తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: