Michael Vaughan: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ పోరుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మాజీ ఆటగాళ్ల విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి భారత్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో భారత్ కంటే ఇంగ్లాండ్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.
Read Also: SA vs NZ: నేడే తొలి సెమీఫైనల్.. సౌతాఫ్రికా vs న్యూజిలాండ్ సమరం
స్పిన్ అటాక్లో ఇంగ్లాండే టాప్.. భారత్ వెనకబడి ఉందన్న వాన్
భారత జట్టు కంటే ఇంగ్లాండ్ వద్దే మెరుగైన స్పిన్ విభాగం ఉందని మైఖేల్ వాన్ విశ్లేషించారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేశారని కొనియాడారు. భారత స్పిన్ వనరుల గురించి మాట్లాడుతూ.. ఎక్స్-ఫ్యాక్టర్గా భావిస్తున్న వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్లు చాలా సులువుగా ఎదుర్కొంటున్నారని, ఫీల్డింగ్లోనూ భారత్ వెనకబడి ఉందని విమర్శించారు.

సెమీస్ పోరులో హ్యాట్రిక్ రికార్డు:
అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో తలపడటం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2022లో ఇంగ్లాండ్ గెలవగా.. 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 2026లో ‘డిసైడర్’ లాంటి ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ స్వదేశీ గడ్డపై చెలరేగాలని పట్టుదలతో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: