భారతదేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్ కోసం మరో 16 స్వదేశీ బుల్లెట్ రైళ్లను (Bullet train) సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ రైళ్లను మన దేశంలోనే, మన ఇంజనీర్ల పర్యవేక్షణలో తయారు చేయడం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎంఎల్ (BEML) ఈ రైళ్ల తయారీ బాధ్యతను దక్కించుకుంది. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఒక గొప్ప నిదర్శనం. వేగంలో కొత్త రికార్డులు – ఫీచర్లు ఇవే! ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ స్వదేశీ బుల్లెట్ రైళ్లు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. బెంగళూరులోని రైల్ కోచ్ కాంప్లెక్స్లో వీటిని తయారు చేస్తున్నారు. ఈ రైళ్లు పూర్తి ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కాన్ఫిగరేషన్తో అందుబాటులోకి రానున్నాయి.
Read Also: Iran Proxy War: పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

జపాన్ సహకారంతో కారిడార్ రూపుదిద్దుకుంటోంది
ప్రతి కోచ్ ధర సుమారు రూ. 27.86 కోట్లుగా నిర్ణయించారు. కేవలం వేగమే కాకుండా, ప్రయాణీకుల భద్రత , సౌకర్యాల విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నారు. జపాన్ సహకారం.. పురోగతి.. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న ఈ 508 కిలోమీటర్ల కారిడార్ జపాన్ సహకారంతో రూపుదిద్దుకుంటోంది. స్వదేశీ రైళ్లతో పాటు, జపాన్ నుండి వచ్చే రెండు అత్యాధునిక E-5 వేరియంట్ షింకన్సెన్ రైళ్లు కూడా 2029-30 నాటికి భారత్ చేరుకుంటాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 12 స్టేషన్లలో ఎనిమిది స్టేషన్ల పునాది పనులు పూర్తయ్యాయి. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ఈ ప్రాజెక్టు కోసం భారీగా రుణ సహాయం అందిస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు స్వయంగా ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.
ప్రయాణం సమయం , డబ్బు రెండు ఆదా..
బుల్లెట్ రైలు (Bullet train) ప్రయాణ ఛార్జీలు విమాన టికెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. విమాన ప్రయాణంలో గడిపే చెక్-ఇన్ సమయం, ఎయిర్పోర్టుకు వెళ్లే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే, బుల్లెట్ రైలు ప్రయాణం సమయం , డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది. కొత్త ప్రతిపాదనలు ఒక ముంబై-అహ్మదాబాద్ కారిడార్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మరో ఏడు కొత్త బుల్లెట్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్తో పాటు దక్షిణ భారత దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించేలా మరికొన్ని బుల్లెట్ రైలు (Bullet train) మార్గాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ముఖ్యంగా హైదరాబాద్ – బెంగళూరు, చెన్నై – బెంగళూరు – మైసూర్ , హైదరాబాద్ – విజయవాడ – చెన్నై కారిడార్లపై నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ (NHSRCL) కసరత్తు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: