Gulf Crisis: పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వీలుగా ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Read Also: Jammu Kashmir: ఖమేనీ మద్దతుదారులపైకి టియర్ గ్యాస్

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రవాసాంధ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఫోన్ ద్వారా సంప్రదించాలనుకునే వారు 0863-2340678 నంబర్కు, అలాగే వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలనుకునే వారు +91 85000 27678 నంబర్కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా బాధితుల వివరాలను సేకరించి, కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ వారిని తరలించే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సహాయక చర్యల్లో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి వివరించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎపిఎన్ఆర్టి ప్రతినిధులు స్థానిక రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతూ, ఇబ్బందుల్లో ఉన్న తెలుగు వారికి అవసరమైన భోజన, వసతి మరియు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ వారు గల్ఫ్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: