Nara Lokesh: కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక అనే చిన్నారి SMA టైప్-1 అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన వారి కండరాలు క్షీణించి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్గెన్స్మా’ అనే ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. దీని ధర అక్షరాలా రూ. 16 కోట్లు. అంత స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూశారు.
Read Also: Toxic Movie: రన్టైమ్ లీక్: రెండు భాగాలుగా యష్ యాక్షన్ థ్రిల్లర్?
ముందుకు వచ్చిన మంత్రి లోకేష్: బాధ్యత నాదేనని హామీ
దాతల సాయంతో సుమారు రూ. 10 కోట్లు సమకూరగా, మిగిలిన రూ. 6 కోట్ల కోసం కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన గొప్ప మనసును చాటుకున్నారు. మిగిలిన రూ. 6 కోట్లు అందేలా చూసే బాధ్యత తనదేనని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. “చిన్నారి పునర్విక పోరాడుతున్న తీరు అభినందనీయం అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘మానవత్వం ఇంకా బతికే ఉంది’: జాన్వీ కపూర్
మంత్రి లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు. లోకేష్ చేసిన పోస్ట్ను రీట్వీట్ చేస్తూ.. “మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇది నిజంగా ప్రశంసనీయమైన కార్యం” అంటూ కొనియాడారు. లోకేష్ ఉదారతకు జాన్వీ వంటి స్టార్ హీరోయిన్ ఫిదా అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు సైతం “రియల్ హీరో లోకేష్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: