हिन्दी | Epaper

Telangana Palm oil price: పామాయిల్ రైతులకు మంత్రి తుమ్మల కీలక హామీ

Saritha
Telangana Palm oil price: పామాయిల్ రైతులకు మంత్రి తుమ్మల కీలక హామీ

Telangana Palm oil price: తెలంగాణలో రైతులు సాంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలికి, అధిక లాభాలు ఇచ్చే వాణిజ్య పంటల వైపు మళ్లేలా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పామాయిల్ సాగు చేసే రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) భారీ హామీ ఇచ్చారు. రాబోయే మూడేళ్లలో టన్ను పామాయిల్ ధరను రూ. 25,000 కు చేర్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

కామారెడ్డి జిల్లా పాల్వంచలో నిర్వహించిన మెగా పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వరి వంటి పంటలు అకాల వర్షాలు, వడగండ్లు మరియు తెగుళ్లకు దెబ్బతినే అవకాశం ఉందని, కానీ పామాయిల్ సాగులో అటువంటి నష్టాలు తక్కువని ఆయన వివరించారు. ఈ పంట ద్వారా రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుందని, ధరల హెచ్చుతగ్గుల నుంచి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

Read Also: CongressVsBJP: కామారెడ్డిలో భూ వివాదంపై రాజకీయ వేడి

Telangana Palm oil price: పామాయిల్ రైతులకు మంత్రి తుమ్మల కీలక హామీ
Telangana: Palm oil price Minister Tummala’s key assurance to palm oil farmers

పామాయిల్‌తో స్థిరమైన ఆదాయం రిస్క్ తక్కువ

కామారెడ్డి జిల్లా పాల్వంచలో నిర్వహించిన మెగా పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, రైతులతో వరి వంటి పంటలు అకాల వర్షాలు, వడగండ్లు, తెగుళ్లకు దెబ్బతినే అవకాశం ఉందని, కానీ పామాయిల్ సాగులో అటువంటి నష్టాలు తక్కువని ఆయన వివరించారు. ఈ పంట ద్వారా నిరంతర ఆదాయం లభిస్తుందని, ధరల హెచ్చుతగ్గుల నుంచి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పామాయిల్ తోటల్లో అదనపు ఆదాయం పొందే మార్గాలను మంత్రి సూచించారు. పామాయిల్ తోటల మధ్య కోకో, వక్క, కూరగాయలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఈ అంతర పంటలకు కూడా ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. సిద్దిపేటలో రూ. 300 కోట్ల భారీ వ్యయంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించినట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయంలో ‘ఏఐ’ (AI) సాంకేతికతకు పెద్దపీట

హైదరాబాద్‌లో జరిగిన మరో కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ వ్యవసాయ రంగం డిజిటల్ విప్లవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్‌లో తెలంగాణ వ్యవసాయ మౌలిక వసతుల గురించి చర్చ రావడం గర్వకారణమన్నారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, అగ్రిహబ్ ఫౌండేషన్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా రైతు రిజిస్ట్రీలు, భూముల వివరాలు మరియు శాస్త్రీయ సలహాలను డిజిటల్ రూపంలో అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870