Minister Azharuddin: మైనారిటీలకు ఆర్థిక మద్దతును రాష్ట్ర ప్రభుత్వం అంది స్తోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ఇదే సందర్భంలో వారికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి పథకాలను కూడా అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్లో గురువారం ఒక ప్రకటనలో ఈ పథకాలు లబ్ధిదారులకు, ముఖ్యంగా మహిళలు, యువతకు ప్రత్యక్ష మద్దతును అందిస్తాయన్నారు. వారు ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి వీలు కల్పిస్తుందని ఆయన ధ్రువీకరించారు. మొత్తంగా రూ.90 కోట్ల వ్యయంతో వివిధ పథకాలను అమలు చేయ నున్నట్లు తెలిపారు. (2025-26) కొనసాగుతున్న పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా, తుర్కా కాషా కమ్యూనిటీ సభ్యులకు టూల్ కిట్లు, జనరేటర్లను పంపిణీ చేయడానికి రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. యూనిట్ ఖర్చు రూ.60,000 వరకు, వారి సాధికారత కోసం ఒకేసారి గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
Read Also: Software Engineer Sunitha: టెక్కీ సునీత మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు

యువతకు ఈ-స్కూటర్లు, మోపెడ్ల పంపిణీ
అలాగే మైనారిటీ యువతకు ఈస్కూటర్ల పంపిణీకి రూ.40 కోట్లు, యూనిట్ ఖర్చు రూ.1.50 లక్షల వరకు, (TG) తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొ రేషన్ నుండి 80 శాతం సబ్సిడీ, యువత సాధికారత కింద 20 శాతం లబ్దిదారుల వాటాతో. కార్పొరేషన్ ఆర్థిక సహాయ పథకం (2024-25) కోసం కూడా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా రూ.5 కోట్లను ఫఖీర్, దూదేకుల, ఇతర ముస్లిం బలహీన మైనారిటీ వర్గాల సభ్యులకు వారి పునరావాసం కోసం మోపెడ్ల పంపిణీకి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.25 కోట్లను ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కింద వారి సాధికారత కోసం మైనారిటీ మహిళలకు (వితంతువు, విడాకులు తీసుకున్నవారు, అనా థలు, నిరాశ్రయులు, ఒంటరి మహిళలు, వంకర టింకరులు) ఒకేసారి గ్రాంట్గా ప్రతి లబ్ధిదారునికి రూ.50 వేల వరకు 100 శాతం సబ్సిడీ చెక్కుల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి అజారుద్దీన్ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: