టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం గురించి గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకను అత్యంత ప్రైవేట్గా, కేవలం కుటుంబ సభ్యులు మరియు అతి తక్కువ మంది అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం, ఈ వేడుకకు సినిమా పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీలను ఎవరినీ ఆహ్వానించలేదని సమాచారం. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే హాజరయ్యే ఈ వేడుకను మీడియా కంటికి చిక్కకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.
పెళ్లి వేడుకకు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలను (Conditions) కూడా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు బయటకు రాకుండా ఉండేందుకు ‘నో ఫోన్ పాలసీ’ (No Phone Policy) అమలు చేస్తున్నారట. అంటే అతిథులెవరూ మొబైల్ ఫోన్లను వేదిక వద్దకు తీసుకెళ్లకూడదని నిబంధన విధించారు. అంతేకాకుండా, తమ పెళ్లికి ఎటువంటి ఖరీదైన బహుమతులు (Gifts) తీసుకురావద్దని, కేవలం పెద్దల ఆశీస్సులు ఉంటే చాలని వారు కోరుతున్నట్లు సమాచారం. ఈ నిబంధనలతో కూడిన ఆహ్వాన పత్రికలనే సన్నిహితులకు పంపినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వివాహ వేడుక ముగిసిన తర్వాత కూడా ఈ జంట తమ వ్యక్తిగత సమయం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సుమారు నెల రోజుల పాటు షూటింగ్స్ నుండి విరామం (Break) తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక మరియు విజయ్ ఇద్దరూ తమ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారట. నెల రోజుల విరామం తర్వాతే తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేసుకున్నారట. అయితే, ఈ వార్తలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అభిమానులు మాత్రం ఈ జంట ఒకటవుతున్నందుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com