Vastu Tips: కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి, సుఖసంతోషాలు పెరగాలంటే వాస్తు సూచనలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచి ప్రతిరోజూ నీరు పోయడం వల్ల దుష్ట శక్తి తొలగి మంచి వైబ్రేషన్స్ ఏర్పడతాయి. అదే దిశలో రాగి లేదా ఇత్తడి పాత్రలో నీటిని ఉంచడం కూడా శుభఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు.
Read Also: Tirupati: కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

దృష్టి దోషాల నుంచి రక్షణ కోసం ఇంటి దక్షిణ భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో లక్ష్మీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ధన సంబంధ సమస్యలు తగ్గి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని నమ్మకం. ఈ వాస్తు పరిహారాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి కుటుంబ సభ్యులకు ఆనందం, శాంతి లభిస్తాయని నిపుణులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: