ఇంతకాలం బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus)ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తన పదవి నుంచి దిగిపోయే వేళ చేసిన ప్రసంగంలో ఇండియాలోని సెవెన్ సిస్టర్స్ గురించి ప్రస్తావించాడు. సెవెన్ సిస్టర్స్ ప్రత్యేక, స్వతంత్ర ప్రాంతం అనేలా వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఢాకాలో యూనస్ తన వీడ్కోలు ప్రసంగం చేశాడు.యూనస్ మాట్లాడుతూ ‘‘నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్తో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక సామర్ధ్యం కలిగి ఉంది. బంగ్లాదేశ్కు ఉన్న సముద్రాలు కేవలం సరిహద్దులే. ఈ సముద్రాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మార్గాలు మాత్రమే’’ అని వ్యాఖ్యానించాడు. నేపాల్, భూటాన్ దేశాలతోపాటు ఇండియాలోని సెవెన్ సిస్టర్స్ను ప్రత్యేకంగా పేర్కొనడంలో యూనస్ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతోంది. ఇండియాలోని ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్గా పేర్కొంటారు. అవి అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. ఈ రాష్ట్రాల గురించి ప్రస్తావించేటప్పుడు యూనస్ ఇండియా అని పేర్కొనాల్సింది. కానీ, మన దేశాన్ని రెచ్చగొట్టేలా సెవెన్ సిస్టర్స్ అని మాత్రం చెప్పాడు. ఒకపక్క బంగ్లాదేశ్లో అంతర్యుద్ధాన్ని ఆపడంలో విఫలమైన యూనస్..(Muhammad Yunus) భారత్ గురించి ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు.
Read Also : http://Cigarette Price: బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

గతంలో కూడా ఆయన ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలే చేశాడు. సెవెన్ సిస్టర్స్ ప్రాంతాన్ని ల్యాండ్ లాక్డ్ ఏరియాగా పేర్కొన్నాడు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించాలని కోరాడు. మంగళవారం బంగ్లాదేశ్లో పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ రోజు సాయంత్రం అక్కడ బీఎన్పీ తరఫున తారిఖ్ రహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: