Box Office: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (SSMB29) షూటింగ్లో నిమగ్నమై ఉన్నారు. ఈ భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే, మహేష్ తదుపరి సినిమా గురించి ఫిలిం నగర్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
Read Also: Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు

షూటింగ్ ముగింపు మరియు ప్రమోషన్స్
చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం, ‘వారణాసి’ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులతో పాటు భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించేందుకు జక్కన్న టీమ్ ప్లాన్ చేస్తోంది.
మహేష్ కోసం క్యూ కడుతున్న అగ్ర సంస్థలు
మహేష్ బాబుతో సినిమా చేసేందుకు హోంబేలె ఫిలిమ్స్, సన్ పిక్చర్స్ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని భావిస్తున్న తరుణంలో, ఆయన తదుపరి చిత్రం కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్తో భారీ స్థాయిలో ఉండబోతోందని సినీ విశ్లేషకుల అంచనా.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: