Kamareddy Municipality: తెలంగాణలోని కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార పోరు ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11 స్థానాలు దక్కించుకోగా, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. స్పష్టమైన మెజార్టీ ఎవరికీ లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పాలన చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల తిరిగి కాంగ్రెస్లో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణికి చైర్పర్సన్ పదవి ఇవ్వడానికి రెండు పార్టీలూ అంగీకరించినట్లు తెలుస్తోంది.
Read Also: TG Municipal Councilors: ప్రమాణ స్వీకారం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు

బీఆర్ఎస్కు వైస్ ఛైర్మన్ పదవి
ఈ పొత్తులో భాగంగా బీఆర్ఎస్కు వైస్ ఛైర్మన్ పదవి కేటాయించనున్నట్లు సమాచారం. కాసర్ల గోదావరి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక అమరచింత మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పాలన చేపట్టేందుకు సమన్వయం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు మున్సిపాలిటీల్లోనూ రాజకీయ సమీకరణాలు కీలక మలుపు తీసుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: