India T20 Winner : కొలంబో వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు కేవలం 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయి 61 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్ గట్టి దెబ్బకొట్టింది. తొలి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ అయ్యాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓవర్లో సైమ్ అయూబ్ కూడా ఔట్ కావడంతో 6 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడిపోతూ పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో పడింది.
Read Also: T20 World Cup 2026: నేపాల్పై వెస్టిండీస్ భారీ విజయం
మరోవైపు భారత్ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా (India T20 Winner) ఆడాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. సూర్యకుమార్ యాదవ్ 31, శివమ్ దూబే 27, తిలక్ వర్మ 25 పరుగులతో సహకరించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 175 పరుగులు చేసింది.
బౌలింగ్లో బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా కీలక వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ కూడా చెరో వికెట్ సాధించారు. వరుసగా మూడో విజయం సాధించిన భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: