బంగ్లాదేశ్ (Bangladesh) లో, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఈ నెల 17న అధికారికంగా కొలువుదీరనుంది. ప్రభుత్వానికి ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు.ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ పార్లమెంటు హౌస్లోని సదరన్ ప్లాజాలో నిర్వహించనున్నారు.
Read Also: PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ.2,000 జమకు కేంద్రం సిద్ధం

అధికారికంగా భారత్ ధ్రువీకరించాల్సి ఉంది
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 13 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇందులో భారత్తో సహా చైనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, ఖతార్, శ్రీలంక, నేపాల్ దేశాలు ఉన్నాయి.బంగ్లాదేశ్ (Bangladesh) లో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం వచ్చాక భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆహ్వానం అందడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా ఆయన తరఫున ఎవరైనా హాజరవుతారా తెలియాల్సి ఉంది. బంగ్లాదేశ్ ఆహ్వానంపై అధికారికంగా భారత్ ధ్రువీకరించాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: