టీ20 వరల్డ్ కప్లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ రేపు జరగనుంది. ఈ హై వోల్టేజ్ పోరుకు ముందు ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్మీట్లో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటారా అనే ప్రశ్నపై స్పష్టత రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
INDvsPAK: మ్యాచ్కు ముందు ‘హ్యాండ్ షేక్’ వివాదం మళ్లీ హాట్ టాపిక్
అదే కోరుకుంటే తప్పకుండా అభిషేక్ను ఆడిస్తాం
ఫిబ్రవరి 14వ తేదీ శనివారం, కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్కు ఒక రోజు ముందు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో అభిషేక్ శర్మ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అయితే, దీనికి ముందు, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా విలేకరుల సమావేశంలో కూడా ఈ ప్రశ్న తలెత్తింది. అభిషేక్ శర్మ లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందా అని అడిగినప్పుడు,

ఆఘా, “అభిషేక్ ఎంత మంచి ఆటగాడో మనందరికీ తెలుసు. మేం ఉత్తమ ఆటగాళ్లతో ఆడాలనుకుంటున్నాం. కాబట్టి రేపటి మ్యాచ్లో అతను ఆడాలని నేను కోరుకుంటున్నాను. అతను కోలుకుంటాడని, ఆడగలడని నేను ఆశిస్తున్నాను” అని అన్నాడు.దీనిపై స్పందించిన సూర్య ‘నిజంగా సల్మాన్ అదే కోరుకుంటే తప్పకుండా అభిషేక్ను ఆడిస్తాం’ అని కౌంటర్ ఇచ్చారు. దీంతో అభి ఆడటం ఖాయమైంది.