ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2026 (T20 WC 2026) టోర్నమెంట్లో భారత మహిళల ‘ఎ’ జట్టుకు తొలి మ్యాచ్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకాక్లో జరిగిన తొలి మ్యాచ్లో పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టు చేతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్- ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనుష్క శర్మ(45 బంతుల్లో 7 ఫోర్లతో 47), తనూజ కన్వార్(25 బంతుల్లో 5 ఫోర్లతో 34) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రాధాయాదవ్(7)తీవ్రంగా నిరాశపర్చింది.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత
టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి
యూఏఈ బౌలర్లలో సమైరా ధరింధర్కా(3/40) మూడు వికెట్లు తీయగా.. వైష్ణవే మహేష్(2/13), ఇషా ఓజా(2/30) రెండేసి వికెట్లు పడగొట్టాడు. సురక్ష కొట్టే, అతిగే సిల్వా చెరో వికెట్ తీసారు.అనంతరం యూఏఈ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది.కెప్టెన్ ఇషా ఓజా(61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించింది.సమైరా(31 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడింది.

భారత బౌలర్లలో రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వార్ తలో వికెట్ తీసారు.భారత్ తమ తదుపరి మ్యాచ్ల్లో పాకిస్థాన్(ఆదివారం), నేపాల్(మంగళవారం)తో తలపడనుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా రెండు గ్రూప్స్ విభజించారు. రెండు గ్రూప్స్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి. భారత్ సెమీఫైనల్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్లను మెరుగైన రన్రేట్తో గెలవాలి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: