Swachh Andhra : రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసి స్వచ్ఛాంధ్ర సాధనకు అధికారులు, ప్రజలు కలిసికట్టుగా కృషిచేయాలని స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ R చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి(Kommireddi Pattabhi) పిలపునిచ్చారు. అమరావతిలోని కార్పోరేషన్ కార్యాలయం నుండి బుధవారం గుంటూరు, అనంతపురం రీజియన్లోని మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా పట్టాభి మాట్లాడుతూ గత ఏడాది స్వచ్ఛాసర్వేక్షణ్ లో జరిగిన లోపాలను సరిదిద్ది ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు కృషిచేయాలని కోరారు.
Read also: TTD: భక్తులకు ఇక సులభంగా లడ్డూ ప్రసాదం

జాతీయస్థాయిలో స్వచ్ఛసర్వేక్షణ్ బృందాలు
మరో నెలరోజుల్లో జాతీయస్థాయిలో స్వచ్ఛసర్వేక్షణ్ బృందాలు మన రాష్ట్రానికి రానున్నాయని, ఈసారి మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో ముందుగానే పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ పనులను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వ్యర్ధాలను వేరు చేయటం, పబ్లిక్య్లెట్స్ నిర్వహణా, నాలాల క్లీనింగ్, పాఠశాలలు, పార్కులు, పర్యాటక ప్రాంతాల శుబ్రతపై దృష్టిసారించాలన్నారు. గత ఏడాది నెగెటివ్ మార్కుల కారణంగా ర్యాంకులు తగ్గిపోయాయని, ఈసారి వాటిని అధిగమించాలన్నారు. గతంలో నెగెటివ్ మార్కులు వచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్తపేరుకుపోవటం, డ్రైనేజీల్లో మురుగునీటి నిలిచిపోవటం, ఐఈసి, సిబీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
ప్రజలను బాగస్వాములను చేసేవిధంగా ఐఈసి, సిబీ కార్యక్రమాలను ఏఐఐఎల్ఎస్, వాష్ ఏజన్సీలు నిర్వహిస్తున్నామన్నారు. సిటిజన్ ఫీడ్బ్యాక్కు మార్కులను 500 నుండి 1000కి పెంచారని ప్రజల నుండి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా పనిచేయాలని పట్టాభి ఆదేశించారు. పబ్లిక్ టాయ్లెట్స్కు నిధులు సమస్య లేదని, కొత్తవి నిర్మించటానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాఠశాలలు, ప్రయివేటు ప్రదేశాల్లో మహిళలు, వికలాంగులకు ప్రత్యేకంగా వారికి కావాల్సిన సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: