గుంటూరు : అసెంబ్లీలో జరిగే చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలిచ్చిన అధికారాన్ని అవమానించినట్లే అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రేపటి నుంచి 16వ శాసనసభ ఐదవ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, శాసనసభ సభ్యుల విధులు, బాధ్యతలు గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. శాసన వ్యవస్థను గౌరవించడం, సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం, రాష్ట్ర అభివృద్ధిపై జరిగే చర్చల్లో పాల్గొనడం, చట్టాల రూపకల్పనలో సలహాలు సూచనలు ఇవ్వడం.. ఇవన్నీ ఒక శాసన సభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్యతలు. కానీ వైసీపీ శాసనసభా పక్షం గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టడం ద్వారా ఆ బాధ్యతలను పూర్తిగా విస్మరించింది.
Read also: Abhishek Sharma: ఆసుపత్రిలో చేరిన అభిషేక్.. మ్యాచు డౌట్ యే

Not attending the Legislative Assembly debates is an insult to authority
సభకు రాకుండా అరాచక ప్రవర్తన ఇది ఎమ్మెల్యేలకు తగునా?
గవర్నర్ ప్రసంగం రోజున మొక్కుబడిగా రావడం, పేపర్లు చించేయడం, విసిరికొట్టడం, సభ నుంచి వెళ్లిపోవడం ఇదే వైసీపీ శాసన సభ్యుల తీరు. వేలాది మంది ఆశలతో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చేయాల్సిన పని ఇదేనా అని వైసీపీ ఎమ్మెల్యేలను, శాసనసభా పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామన్నారు. 19 నెలలుగా చట్టసభ సభ్యులుగా మీ ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించారా? చేయకపోతే శాసనసభ సభ్యులుగా కొనసాగేందుకు మీకు నైతిక అర్హత ఉందా? అని నిలదీశారు. నియోజకవర్గ సమస్యలపై నోరు మెదపని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ఏనాడూ సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, చట్టాల రూపకల్పనపై ఒక్కసారి కూడా నిర్మాణాత్మక చర్చ చేయని శాసన సభ్యులు, శాసనసభ సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికమో వైసీపీ నేతలు ఆలోచించాలన్నారు. శాసనసభ పట్ల గౌరవం ఉంటే, శాసన వ్యవస్థపై నమ్మకం ఉంటే, కనీసం ఇప్పుడైనా సభకు వచ్చి చర్చల్లో పాల్గొనాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వేదిక సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అని, ఏ అంశంపైనైనా చర్చించడానికి, ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: