చెరువును ఆక్రమించి ప్లాట్లను చేసి విక్రయించేందుకు సిద్ధం చేసిన వైనంపై హైడ్రా(HYDRAA) యాక్షన్ కు దిగింది. దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన నాలుగు ఎకరాల చెరువు భూమిని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కొండాపూర్ లోని జంగమోని కుంట చెరువు ఆక్రమణలను మంగళవారం తొలగించిన హైడ్రా అధికారులు చెరువు భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు.
Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!


దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొండాపూర్ (Kondapur) మజీద్బాండలో సర్వే నెంబర్ 134లో జంగమోని కుంట చెరువు ఉంది. నాడు చుట్టు ప్రక్కల ప్రాంతాల భూములకు సాగునీటిని అందించిన ఈ చెరువు చుట్టూ నిర్మాణాలు పుట్టుకురావడంతో చెరువులోకి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది కబ్జాదారులు చెరువు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. విషయమై రెవెన్యూ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు.

కానీ చెరువు భూమి ఆక్రమణపై వెనక్కు తగ్గని కబ్జాదారులు తాజాగా గతకొన్ని రోజులుగా మరోసారి మట్టి నింపి చదును చేయ సాగారు. ఈ విషయాన్ని స్థానికులు హైడ్రాకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే నిర్వహించారు. దాదాపు 4 ఎకరాల జంగమోని కుంట చెరువును ఆక్రమించేం దుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న హైడ్రా అధికారులు మంగళవారం యాక్షన్కు దిగింది. చెరువు భూమిలో పాక్షికంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను నేలమట్టం చేసి 4 ఎకరాల చెరువు భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
దీంతో పాటు సదరు స్థతం జంగమోని కుంట చెరువు అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. మరోసారి చెరువు భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తే కబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
E paper : epaper.vaartha.com
Read Also: