మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు గంటలే మిగిలి ఉండటంతో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు, పార్టీల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్కో ఓటుకు వేల రూపాయల నుంచి లక్షల విలువైన హామీల వరకు వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. చేవెళ్ల ప్రాంతంలో ఓ అభ్యర్థి తాను గెలిస్తే ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని ప్రకటించడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఇంతగా డబ్బుతో కొలవబడటం విమర్శలకు దారి తీస్తోంది.
Read also: Bhuvanapalli: కోడవటంచలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

The season of temptations that began in the municipal elections
ఓటుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు
ప్రత్యేకంగా హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో ప్రలోభాల పర్వం మరింత తీవ్రంగా సాగుతోంది. ఓటుకు కనీసం రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.30 వేల వరకు డబ్బులు పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో కౌన్సిలర్ పదవికే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డబ్బుతో పాటు మద్యం, చికెన్, మటన్ విందులు కూడా ఓటర్లను ఆకర్షించే సాధనాలుగా మారాయి.
బహుమతుల వర్షం.. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు
ఈ ఎన్నికల్లో డబ్బుతో పాటు గృహోపకరణాల పంపిణీ కూడా సాధారణమైపోయింది. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, ప్రెజర్ కుక్కర్లు వంటి ఖరీదైన బహుమతులు ఓటర్లకు అందిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రలోభాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. డబ్బు వెదజల్లి గెలిచిన అభ్యర్థులు పదవిలోకి వచ్చాక అభివృద్ధి కన్నా అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: