నారాయణపేట(Narayanpet) జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది. ఇటీవల వరకు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Read Also:Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

ఎన్నికల ప్రచారం చేసిన మరుసటి రోజే మృతి
మహదేవప్ప మృతి వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని ప్రత్యర్థి నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని, వేధింపులు పెరిగాయని వారు పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్ల వల్ల ఆయన తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. మంత్రి శ్రీహరి మరియు ఆయన అనుచరుల రాజకీయ వేధింపులే మహదేవప్ప మరణానికి కారణమని ఆరోపించారు. ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మక్తల్ మున్సిపాలిటీలో(Narayanpet) ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: