Asaduddin Owaisi : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెడ్లు అయినా, రావులు అయినా మా దగ్గరకే రావాల్సిందే” అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ముఖ్యమంత్రుల దగ్గరకు తాము వెళ్లమని, అవసరమైతే వాళ్లే తమ వద్దకు రావాలని ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రస్తావిస్తూ, ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ నిజంగా గెలిచిందా? అని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏమిటో స్పష్టంగా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్

ఇదిలా ఉండగా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై ఓవైసీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలను కాల్చుతున్నట్టుగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతోనే హిమంత ఈ వీడియోను షేర్ చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: