ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరోసారి ఢిల్లీకు బయల్దేరుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన విమానం బయల్దేరనుంది. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్లోని నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ నిర్వహించనున్నారు.
Read Also: AP Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభం.. 88 వేల ఉద్యోగాలు!

16న ఏపీ పర్యటనకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న బకాయిల విడుదల, పోలవరం పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్ ను (Nirmala Sitharaman) కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై చంద్రబాబు (CM Chandrababu) చర్చించనున్నారు.
16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర అంశాలను కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి బయల్డేరి 8 గంటలకు విజయవాడ చేరుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: