హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిని మరింత విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ (HYD) చుట్టూ ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన రవాణా సౌకర్యాలు, ఏకీకృత అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Telangana Govt: వాట్సాప్ మీ-సేవ’కు భారీ స్పందన

అయితే రాజధాని హైదరాబాద్లో గ్రేటక్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది. ప్రస్తుతం 300 డివిజన్లతో దేశంలోనే అతి పెద్ద మహానగరంగా విస్తరించిన జీహెచ్ఎంసీని (GHMC) ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించనుంది. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి కార్పొరేషన్ (MMC), సైబరాబాద్ కార్పొరేషన్ (CMC) పేర్లతో ఇవి ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్లు, మల్కాజిగిరి కార్పొరేషన్లో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లు, సైబరాబాద్ కార్పొరేషన్లో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండనున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: