Telangana : గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ. 259.36 కోట్లను విడుదల చేసింది. ఇది రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ఊరటనిచ్చే పరిణామమని పంచాయతీరాజ్(Panchayati Raj) శాఖవర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల జాప్యంతో రెండేళ్లుగా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ పలుకారణాల వల్ల గత రెండేళ్లుగా నిలిచి పోయాయి.
Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం, దానిపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడం ఈ జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల మిగిలిన నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి సీతక్క విజప్తి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాతే పెండింగ్ నిధులు విడుదల చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. కేంద్ర పెద్దలతో రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పలు దఫాలు చర్చలు జరిపారు.
15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం ఉత్తర్వులు
గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురు కావడం, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 లోపు నిధులు విడుదల కాకపోతే నిధులు శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం
ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో పెండింగ్. నిధులు వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.
కేంద్ర శాఖలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, ఇతర అధికారులు కూడా నిరంతరంగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: