ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో (TG) టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ను బీజేపీ నేతలు భిక్షాం దేహి అని అడిగారని, ఆయన ఆంధ్ర నాయకుడని, తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఆయన చెప్తే తెలంగాణ ప్రజలు ఓటు వేయరని, గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని, పవన్ రాజకీయాలు ఆంధ్రాలో చేసుకోవాలని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ (TG) జనసేన స్పందిస్తూ… కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు తెలంగాణ రాష్ట్ర పార్టీలు కాదని… అవి జాతీయ పార్టీలని తెలిపింది. జనసేన అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన పార్టీ కాదని… జాతీయ సమగ్రత కోసం తెలంగాణలో పెట్టిన పార్టీ అని పేర్కొంది. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: