हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Chevella news: న్యాయవాది హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆస్తి కోసం చెల్లెలిని చంపించిన అన్న!

Tejaswini Y
Chevella news: న్యాయవాది హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆస్తి కోసం చెల్లెలిని చంపించిన అన్న!

Chevella news: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఇటీవల కలకలం రేపిన మహిళా న్యాయవాది స్వప్న హత్యోదంతం సుఖాంతమైంది. ఆస్తి కోసం ఒక తోడబుట్టిన అన్న ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదాలే తన చెల్లెలి ప్రాణాలు తీయడానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read also: Choppadandi Elections: BRS టిక్కెట్ ఇవ్వలేదని ఓ జంట వినూత్న నిరసన

Chevella news: Big twist in lawyer murder case
Chevella news: Big twist in lawyer murder case

హత్యకు ప్రధాన కారణం ‘ఆస్తి’

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు రాజు, తన సోదరి స్వప్న మధ్య గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. స్వప్న తన వాటా కోసం కోరుతుండటంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని రాజు పథకం వేశాడు. ఇందుకోసం ఒక సుపారీ గ్యాంగ్‌ (Sufari Gang)తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిత్యం పొలానికి వెళ్లే అలవాటున్న స్వప్నపై నిఘా ఉంచిన సుపారీ గ్యాంగ్, సమయం కోసం వేచి చూసింది. ఉదయం ఆమె ఒంటరిగా పొలానికి వెళ్లిన సమయంలో.. ముసుగులు ధరించిన దుండగులు కారులో వేగంగా వచ్చి ఆమెను అడ్డగించారు. తప్పించుకునే లోపే కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను అక్కడికక్కడే హతమార్చి పరారయ్యారు.

ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చేవెళ్ల పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు రాజుతో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన మరో వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హంతకులకు సహకరించిన మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

న్యాయవాదిగా సమాజంలో గౌరవప్రదంగా ఉన్న మహిళను, ఆమె సొంత సోదరుడే కిరాయి హంతకులతో చంపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870