85 శాతం పోలింగ్, 10న కౌంటింగ్
హైదరాబాద్ : (TG) రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. రాష్ట్ర హైకోర్టు (State High Court), నాంపల్లి క్రిమినల్ కోర్టు, సిటీసివిల్ కోర్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టులలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. దాదాపు 36 వేల మంది అడ్వకేట్లు ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. కాగా, సాయంత్రం 5 గంటల సమయానికి లైన్లో ఉన్న ఓటర్లు పోలింగ్ పాల్గొనేందుకు అనుమతించడంతో పోలింగ్ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. దాదాపు 85శాతం వరకు పోలింగ్ జరిగినట్లు సమాచారం. 23 మంది బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కౌన్సిల్ సభ్యత్వ పదవి కోసం 203 మంది అడ్వకేట్లు పోటీ పడ్డారు. 203 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో బ్యాలెట్ పేపర్ అతి పెద్దగా ప్రింట్ చేసి ఓటర్లకు అందుబాటులో ఉంచారు. కౌన్సిల్ సభ్యులను ప్రాధాన్యతా క్రమం ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది.
Read Also: AP: ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

ఫిబ్రవరి 10 నుంచి కౌంటింగ్ ప్రారంభ
ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ అక్షరాలలో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా బాక్స్ వన్, టూ, త్రి, ఫోర్, ఫైవ్ (కనీసం ఐదు) అని క్యాప్టల్ లెటర్స్ రూపంలో రాయడం ద్వారా ప్రాధాన్యత ఓటు వేసి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో (TG) రాష్ట్రంలోని అన్ని ప్రధాన కోర్టులలో బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ డబ్బాలన్నీ అన్ని జిల్లాల కోర్టుల నుంచి హైకోర్టులోని బార్ కౌన్సిల్ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ కౌంటింగ్కు పెద్ద ఎత్తున
ఏర్పాట్లు చేస్తారు.
ఫిబ్రవరి 10 నుంచి బార్ కౌన్సిల్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేయడం ద్వారా ఫలితాలపై స్పష్టత వస్తుంది. కౌంటింగ్ క్రమంలో అత్యధిక ఓట్లు సాధించిన సభ్యుల పేర్లను వరుసగా ప్రకటిస్తారు. బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనట్లుగా వారికి సర్టిఫికేట్లు అందజేస్తారు. తర్వాత 23 మంది సభ్యులకు మద్దతుగా ఉండేందుకు మరో ఇద్దరు మహిళా అడ్వకేట్లను కోఆప్షన్ సభ్యులుగా నియామకం చేస్తారు. ఈ 25 మంది కలిసి బార్ కౌన్సిల్ చైర్మన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత వివిధ అంశాలపై బార్ కౌన్సిల్లో పలు సబ్ కమిటీలను కూడా నియామకం చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: