Hyderabad ATM robbery : హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో జరిగిన భారీ దోపిడీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న ఓ ఏటీఎం సెంటర్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కాల్పులు జరిపి సుమారు రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
Read Also:ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్

ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పట్టపగలే కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను కంట్రోల్లోకి తీసుకున్నారు. దుండగుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: