1959 జూలై 22న జన్మించిన అజిత్ పవార్, ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ సోదరుడు అనంత్ రావు పవార్ కుమారుడు. బాబాయి అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లో అపారమైన అనుభవాన్ని గడించారు. 1982లో సహకార రంగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్గా 16 ఏళ్ల పాటు పనిచేశారు. 1991లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికైనప్పటికీ, తన బాబాయి శరద్ పవార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి తన సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read also: Plane Crash: అజిత్ పవార్ మృతి పట్ల మమతా బెనర్జీ విచారం

Ajit Pawar dies in a tragic accident
ప్రమాదం ఎలా జరిగింది?
మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వార్త తెలియగానే యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగలిగే శక్తి ఉన్న అజిత్ పవార్ (Ajit Pawar) (66) మరణం అటు ఆయన పార్టీకి, ఇటు ప్రభుత్వానికి తీరని లోటుగా మారింది. ప్రమాదం ఎలా జరిగింది? జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి విమానంలో బయల్దేరారు.
అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు
ఉదయం 8:45 గంటల ప్రాంతంలో విమానం బారామతికి చేరువలో ఉన్న సమయంలో అదుపుతప్పి కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, విమానం అదుపు తప్పి కిందకు పడిపోగానే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు ఆయన వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు విమాన సిబ్బంది (పైలట్లు) ఉన్నట్లు గుర్తించింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలై పూర్తిగా దగ్ధమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: